ఓటీటీలోకి వచ్చేసిన ‘మెర్రీ క్రిస్మస్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి జంటగా నటించిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మెర్రీ క్రిస్మస్‌’. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. గ్రిప్పింగ్ స్టోరీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కత్రినా, విజయ్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ ఇద్దరు నటుల నటనకు మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

మొదట ఈ జంట ఎలా ఉంటుందోనని అనుమాన పడ్డ అభిమానులు సినిమా చూసిన తర్వాత రిలాక్స్ అయ్యారు. ఇద్దరు ఫ్రేమ్ లో కనిపించిన ప్రతిసారి మ్యాజిక్ చేశారని ఖుష్ అయ్యారు. థియేటర్ లో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ్టి (మార్చి 8వ తేదీ) నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు, తమిళ, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version