‘ఖుషి’ ట్రైలర్‌ రాగానే థియేటర్‌ నుంచి వెళ్లిపోయిన నాగచైతన్య?

-

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఖుషి’. సెప్టెంబ్ 1వ తేదీన థియేటర్​లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..? సమంత మాజీ భర్త, హీరో నాగచైతన్య.. ఓ సినిమాకు చూడటానికి ఇటీవల థియేటర్ వెళ్లాడట. ఆ సినిమా బ్రేక్ టైంలో ఖుషి ట్రైలర్ రావడంతో వెంటనే చై థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది.

ఈ రూమర్స్​పై నాగ చైతన్య తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చై.. అవన్నీ చెత్త వార్తలని కొట్టిపారేశాడు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్‌లో రూమర్స్‌ తన దృష్టికి వచ్చాని.. ఆ వార్తలను సరిచేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించామని అన్నారు. 2021లో సమంత-నాగచైతన్యలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version