రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “రామాయణ”. ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణ సినిమాలో సూర్పణఖ పాత్రలో నటి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొదట ఈ సినిమాలో సూర్పణఖగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను చిత్ర బృందం సభ్యులు సంప్రదించగా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం అందుతోంది.

అయితే ప్రియాంక చోప్రా ఇదివరకే పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో నటించనని చెప్పిందట. అనంతరం ఇందులో సూర్పణఖ పాత్రలో రకుల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు భావించి ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాగా సూర్పణఖ పాత్రలో రకుల్ చాలా బాగా సెట్ అయ్యారని సమాచారం అందుతోంది. ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కానుంది.