బెట్టింగ్ యాప్స్ కేసులో.. ఈడీ విచారణకు రానా డుమ్మా కొట్టారు. రేపు తాను విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు నటుడు రానా. షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో.. రేపు రాలేనని వెల్లడించాడు రానా. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు.. కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు జారీ అయ్యాయి. రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగష్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న హాజరుకావాలని ఆదేశించింది ఈడీ. ఇటీవలే బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసింది ఈడీ.