సమంత పై అలాంటి కామెంట్స్ చేసిన రంగస్థలం మహేష్..!

-

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ మహేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కానీ రంగస్థలంలో అవకాశం వచ్చిన తర్వాతే ఆయన భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ విషయాలను వెల్లడించారు. మెగా ఫ్యామిలీలో ఒక అల్లు అర్జున్ తో తప్ప అందరి సినిమాలలో నటించానని తెలిపిన మహేష్.. ఆఖరికి నిహారిక గారి ఒక మనసు సినిమాలో కూడా నటించానని తెలిపారు. రంగస్థలం సినిమాలోని మధురమైన జ్ఞాపకాల గురించి మహేష్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ తో ఫోటో కావాలని అడగగా.. మామూలుగా దిగితే సరిపోదని.. చేయి ఇలా బిగించు అప్పుడు ఇస్తా ఫోటో అని చెప్పారని మహేష్ చెప్పకు వచ్చారు.

ఏంటి కండలు పెంచుతున్నావ్ అని రాంచరణ్ అడగ్గా.. ధూమ్ సినిమాలో జాన్ అబ్రహం లా అవుదామని అనుకుంటున్నాను సార్ అని చెప్పానని మహేష్ కామెంట్లు చేశారు. ఇక నా యాస బాగుంటుందని చరణ్, సమంత లకు నా యాస గమనించాలని సుకుమార్ చెప్పారని మహేష్ తెలిపారు. ఇక సమంత చాలా బాగా తనను చూసుకున్నారని, చరణ్ ఫ్రూట్స్ కానీ బ్రేక్ ఫాస్ట్ కానీ నేనే ఎక్కువగా తిన్నానని ఆయన కామెంట్లు చేశారు. ఇక సమంత సెట్లో ఉన్నంత సేపు చాలా సందడిగా ఉంటుందని.. ఆమె ప్రతి ఒక్కరితో కలిసిపోయి వ్యవహరిస్తుంది అని.. తనకు చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అన్న తేడా లేదు అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇకపోతే సమంత, రామ్ చరణ్ లు ఇద్దరూ చాలా మంచి వాళ్ళు అని, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులన్న గర్వం ఏ రోజు కనిపించదు అంటూ వారి మంచి మనస్తత్వం గురించి మరొకసారి గుర్తు చేశారు మహేష్. మొత్తానికి అయితే మహేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version