అల్లు అర్జున్​ను అన్​ఫాలో చేసిన మెగా మేనల్లుడు!

-

ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్​కల్యాణ్​ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీపార్క్​ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్​ అబ్దుల్​నజీర్ వీరితో ప్రమాణం చేయించారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. చిరంజీవి, నాగబాబు ఫ్యామిలీతో పాటు చిరు సోదరీమణుల కుటుంబం కూడా వచ్చింది. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనపడలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఏదో జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా..  మెగాహీరో సాయితేజ్​ అల్లు అర్జున్​, స్నేహా రెడ్డిని అన్​ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే  అల్లుశిరీశ్​ను మాత్రం ఆయన ఫాలో అవుతున్నారు.  ఇప్పటికే సోషల్​ మీడియాలో మెగాఫ్యాన్స్ వర్సెస్ అల్లుఫ్యాన్స్ గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. బన్నీ ఎన్నికల్లో పవన్​కు సోషల్​మీడియా ద్వారా మద్దతు తెలిపి వైసీపీ అభ్యర్థి కోసం ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్టింట ఫ్యాన్ వార్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version