ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

-

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రత్యూష సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. నేను కోరుకున్న జీవితం ఇది కాదు.. అందుకే వెళ్ళిపోతున్నాను అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది ప్రత్యూష. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న ప్రత్యూష డిప్రెషన్ నుండి బయటకు రాలేక కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని పిల్చినట్లు గుర్తించారు పోలీసులు.

నిప్పులపై రసాయనాన్ని కాల్చి ఆ పొగ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ హీరోయిన్ తో ప్రత్యూష చివరిగా మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ప్రత్యూష ఒకరు.ప్రత్యూష సూసైడ్ లెటర్, పెన్ డ్రైవ్, మొబైల్ లను సీజ్ చేశారు పోలీసులు.ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టమ్ పూర్తి చేసి..మృతదేహాన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు.రేపు ప్రత్యూష అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version