నరేష్, పవన్ పెళ్లిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత.. ఏమన్నారంటే..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ గా పేరు పొందిన నటుడు నరేష్ ఇదివరకే మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే కొన్ని కారణాలవల్ల ఈ ముగ్గురు భార్యలతో విడిపోయి ఒంటరిగా ఉండేవారు. అలాంటి సమయంలోనే నటి పవిత్ర లోకేష్ తో పరిచయం ఏర్పడడంతో వీరిద్దరూ కలిసే ఉంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా వీరిద్దరి గురించి ఎక్కడ చూసినా చర్చనీయాంశంగానే మారుతుంది. ఇక నరేష్ పవిత్రను వివాహం చేసుకుంటున్నారని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చాలా రచ్చ రచ్చ చేస్తుంది

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా నిర్మాత అయిన నట్టి కుమార్ పవిత్ర లోకేష్ , నరేష్ వివాహం గురించి మాట్లాడడం జరిగింది. మీడియాతో నట్టి కుమార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఇండస్ట్రీలో చాలా దుమారం చేశారని తెలియజేశారు కదా అనే ప్రశ్న నట్టి కుమార్ కు ఎదురవ్వగా.. అందుకు నట్టి కుమార్ స్పందిస్తూ ఎవరి ఇష్టం వారిది.. ప్రేమ పెళ్లి అనేది వారి యొక్క పర్సనల్ విషయమని తెలియజేశారు. సమాజంలో ఎవరు చేసినా ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ సెలబ్రిటీలు చేస్తే మాత్రం మీడియా చాలా హడావిడి చేస్తుందని నట్టి కుమార్ తెలిపారు.

ఇక పవిత్ర లోకేష్ , నరేష్ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. నరేష్ కి ఇప్పటికే పిల్లలు ఉన్నారు. ఆయన మూడు వివాహాలు చేసుకున్నారు. ఇది నిజమే. పవిత్ర లోకేష్ కు కూడా ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయని తెలుస్తోందని తెలిపారు.. కానీ నరేష్ , పవిత్ర మాత్రం ఇద్దరూ కూడా మంచి ఆర్టిస్టులే వీరిద్దరికీ కూడా సినీ అవకాశాలు చాలానే వస్తున్నాయని తెలిపారు నట్టి కుమార్. కానీ నరేష్ తన మూడో భార్య రమ్యను కూడా అధికారికంగా వివాహం చేసుకున్నారు.

రమ్య నరేష్ ను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన తెలిపారు.. అసలు సమస్య ఏదైనా ఉంటే వారే పరిష్కరించుకోవాలి ఇలాంటి విషయాలను అసలు బయటికి చెప్పకూడదు.. చెబితే ఇండస్ట్రీలో చాలా చులకన అవుతారని నట్టి కుమార్ తెలిపారు. ఈయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version