ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరో వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. అయితే కొన్ని కారణాల చేత హీరోగా సినిమాలు చేయలేదు కానీ పలు చిత్రాలలో మాత్రం సైడ్ క్యారెక్టర్ లో నటిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ హీరో సినిమా విడుదల కాగా ఏడు సంవత్సరాలు పైనే కావస్తోంది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆలీతో సరదాగా షోకి రావడం జరిగింది.. ఇందులో పలు విషయాలను తెలియజేశారు వాటి గురించి చూద్దాం.కమెడియన్ ఆలీని యూట్యూబ్లో హీరో వేణు తొట్టెంపూడి, వడ్డే నవీన్ వంటి వారిని తీసుకురావాలని కామెంట్లు చేస్తూనే ఉన్నారట. కానీ ఎట్టకేలకు తొట్టెంపూడి వేణు రాకతో ప్రేక్షకుల మనసు ఫుల్ ఖుషి అవుతోందని ఆలి తెలియజేయడం జరిగింది. ఇక ఈ షోలో భాగంగా మాట్లాడుతూ వేణు హీరోగా పరిచయం చేయవలసింది మొదట భారతి రాజానే నట కానీ కొన్ని కారణాల చేత అది మిస్ అయింది అంటూ తెలిపారు చిరునవ్వు సినిమా తన కెరియర్ మార్చిందని ఆ సినిమా కోసం ఎన్నో నెలలు వెయిట్ చేశానని తెలియజేశారు.

ఇక అంతే కాకుండా కమెడియన్ ఆలీ వేణు గురించి మరిన్ని సంభాషణలు జరిగినట్లుగా కనిపిస్తోంది. తన కెరియర్ లో ఆలీతో కలిసి నటించిన పలు చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి గుర్తు చేసుకున్నాడు వేణు తొట్టెంపూడి. ఇక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథని మొదట పూరి జగన్నాథ్ హీరో వేణు తో చేస్తానని చెప్పి చేయలేదట కానీ ఆ తర్వాత మాత్రం వచ్చి అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా లో హీరో మీరే, యాంకర్ మీరే, అన్ని కవర్ చేస్తారని తెలియజేశారట కానీ చివరికి సినిమాలో మాత్రం తనని తీసుకోలేదని తెలియజేశారు వేణు. కానీ ఆ సంఘటన మాత్రం తనని చాలా బాధ పెడుతోంది అన్నట్లుగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version