హీరోయిన్ నిత్యమీనన్ ఇంట్లో విషాదం

-

టాలీవుడ్ హీరోయిన్ నిత్య మీనన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిత్యామీనన్ అమ్మమ్మ మృతి చెందారు. తాను ఎంతో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు అంటూ నిత్యామీనన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ‘ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న అమ్మమ్మ.

గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. ఇప్పటినుండి మరో కోణంలో చూసుకుంటా’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోను నిత్య మీనన్ పంచుకున్నారు. కాగా, ఈమె నటిగా 8 ఏళ్ల వయసులోనే ఒక ఇంగ్లీష్ చిత్రంలో 1998లో టబు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2006 16వయేట కన్నడ సినిమా 7 O Clock మూవీలో సహాయ పాత్రలో నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version