అత్తగారింటికి షిఫ్ట్‌ అవుతున్నాం: ఉపాసన

-

టాలీవుడ్ పవర్ కపుల్​ అనగానే గుర్తొచ్చే వారిలో మొదట వినిపించే పేరు రామ్ చరణ్-ఉపాసన. ఈ జంట ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ టైంను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇటీవలే తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఈ జంట. ఈ నేపథ్యంలో ఉపాసన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం చెప్పింది.

‘‘సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ, మేము దానికి పూర్తి భిన్నం. ప్రస్తుతం చరణ్‌ నేనూ.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమామల (చిరంజీవి-సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే, మా (చరణ్‌, ఉపాసన) ఎదుగుదలలో గ్రాండ్‌ పేరంట్స్‌ కీలకపాత్ర పోషించారు. వాళ్ల నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గ్రాండ్‌ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు’’ అని ఉపాసన చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version