తన ఫ్యాన్స్ కు కోటి రూపాయలు గిఫ్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా ఖుషి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషి చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు.
![Vijay Devarakonda will give a gift of Rs](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/09/Vijay-Devarakonda-will-give-a-gift-of-Rs.jpg)
సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. ఈ తరుణంలోనే నిన్న ఖుషీ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..కీలక ప్రకటన చేశారు. ఖుషి సినిమా హిట్ అయినందుకు తన సంపాదన నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు విజయ్ దేవరకొండ.
కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ
ఖుషి సినిమా హిట్ అయినందుకు తన సంపాదన నుండి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విజయ్ దేవరకొండ#Kushi #VijayDeverakonda #KushiforFamilies pic.twitter.com/uyZqH3O6yF
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2023