రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన యంగ్ టైగర్.. ఎస్ఎస్ కార్తీకేయ ట్వీట్ వైరల్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’సినిమా సెప్టెంబర్ 27న ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలవ్వగా.. ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించిన విషయం తెలిసిందే. ఇక నేడు దేవర రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల కోలాహలం మాములుగా లేదు.ఎక్కడ దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ జోరు కనిపిస్తోంది. అభిమానులు ప్రీమియర్ షోల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎస్‌ఎస్ రాజమౌళితో సినిమా తర్వాత ఏ హీరో అయినా తన తదుపరి మూవీ ఫెయిల్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కానీ ఆ టాక్‌ను దేవర చెరిపివేసిందని జక్కన్న కొడుకు ఎస్ ఎష్ కార్తీకేయ పేర్కొన్నాడు. ‘23 ఏళ్ల కిందట ఎవరితో అయితే మొదలైందో ఆయనతోనే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. ఎన్టీఆర్‌ను దగ్గర నుంచి చూస్తూ పెరగడం, ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన బహుమతి ఇది’ అని కార్తీకేయ రాసుకొచ్చారు. కాగా, గతంలో రాజమౌళితో ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ సినిమా తీశాక తన తదుపరి సినిమాలు అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version