ఇక తిరుమలలో ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఫ్రీ.. !

-

తిరుమల.. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మనసుకు ఎంత ఆనందాన్నిస్తుందో.. తిరుపతి లడ్డూ జిహ్వకు అంతే ఆనందాన్నిస్తుంది. అయితే భక్తులకు తియ్యటి వార్తను అందించింది. ఆ విషయాలు… నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అద్భుతమైన కానుకను ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

అంతేకాదు.. అదనంగా లడ్డులు కావాలంటే ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే కౌంటర్లో ప్రసాదాన్ని కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ప్రకటన ప్రకారం.. నెలకు 24 లక్షల లడ్డులను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు. రానున్న వైకుంఠ ఏకాదశి నుంచి నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version