న‌న్ను మీరే ఓడించారంటూ బాబోరు సంచ‌ల‌న కామెంట్స్‌..

-

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స‌తీస‌మేతంగా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అమరావతిలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు పలికారు. అమరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. ఇదిలా ఉంటే.. అమరావతి రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని వాసులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను మీరే ఓడించారంటూ కృష్ణాయపాలెంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో చంద్రబాబు అన్నారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజావేదికను కూల్చినప్పుడు..అంతా మనకెందుకు అనుకున్నారని వ్యాఖ్యానించారు. తన ఇల్లును ముంచే ప్రయత్నం చేస్తే… చంద్రబాబు సొంత గొడవ అనుకున్నారని తెలిపారు. ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి ఇక్కడి ప్రజలందరిలో ఆందోళన మొదలైందని చంద్రబాబు అన్నారు. తాను వ‌ద్ద‌న్నా మీరు జ‌గ‌న్‌కే ప‌ట్టం క‌ట్టార‌ని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల సమయంలో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని మొత్తుకున్నా ఎవరూ వినలేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version