శ్రీకృష్ణుడు, జాంబవంతుడు మల్లయుద్ధం చేసిన గుహలు ఎక్కడున్నాయో తెలుసా ?

-

భారతంలో శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం జాంబవంతునితో చేసిన యుద్ధం అందరికీ తెలిసిందే. అయితే అసలు ఆ గుహలు ఎక్కడున్నయో తెలుసుకుందాం… శ్రీకృష్ణుడు నివసించినది మొదలు నిర్యాణం వరకు దాదాపు ఎక్కువ కాలం నివసించిన రాష్ట్రం గుజరాత్‌. పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి, జాంబవంతునికి యుద్ధం జరిగిన ప్రదేశం కూడా ఇదే రాష్ట్రంలో వుంది.

సోమనాథ్ నుంచి ద్వారకకి రోడ్డు మార్గంలో వస్తుంటే ఈ జాంబవంతుని గుహలు ఉన్నాయి. ఈ గుహలు పోర్ బందర్ 17 కి.మీ. దూరంలో రాజ్ కోట్ కి వెళ్ళే రహదారిపై రణ్ వావ్ గ్రామంలో వున్నాయి. అక్కడ సిమెంట్ ఫాక్టరీకి దగ్గరలో వుంది. వూరికి దూరంగా కొండల మధ్య విశాలమైన ప్రదేశంలో వున్నాయి. ఇక్కడే శ్రీకృష్ణుడు జాంబవంతుల యుద్ధం జరిగినట్లు, జాంబవతిని వివాహం చేసుకున్న ప్రదేశం ఇది అని చెబుతారు. మహాభారతం లోని కధ అందరికి తెలిసిందే. వినాయక వ్రతం రోజున అందరం కధ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటాము. జాంబవంతుడు శమంతక మణిని జాంబవతికి ఆడుకోవటానికి ఇస్తాడు. తనపై మోపబడిన నింద రూపుమాప డానికై ఆమణి కోసం వెతుకుతూ శ్రీకృష్ణుడు ఈ గుహ వద్దకు వచ్చి జాంబ వంతునితో యుద్ధం చేస్తాడు. త్రేతా యుగంలో రామునితో యుద్ధం చేయాలనే కోరిక వున్న జాంబవంతుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంటాడు. మణితో పాటు తన కుమార్తె నిచ్చి శ్రీకృష్ణుతో వివాహం జరిపిస్తాడు జాంబవంతుడు. ఈ గుహలోకి వెళ్లడానికి సన్నని మెట్లు దిగి ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళే వీలున్న మెట్ల ఉన్నాయి. లోపల చీకటి గా వున్నా అక్కడక్కడా పైనుంచి హోల్స్ వుం టం వల్ల అక్కడక్కడ వెలుతురూ వుంది . గుహలో రోజూ చిన్న శివుని విగ్రహం, అభిషేకం పూజలు చేస్తున్నట్లుగా వుంది . విశాలమైన ఈ గుహలో లోపలి వెళ్తే అక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడికి జాంవంతునికి జాంబవంతుని వివాహం చేస్తున్న పెద్ద పెయింటింగ్ వుంది.

ఇక్కడ వున్న శివలింగాలు పై నుంచి పడిన నీటి బిందువులతో ఏర్పడినవి. చాలా శివలింగాలు వున్నాయి . గుహ బయట మనకి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. గుహలోకి వెళ్ళిన వారు అక్కడి మట్టి రేణువులను సైతం ఎవరూ తీసుకు వెళ్ళకూడదు అని రాసారు. ఒకవేళ తీసుకు వెడితే ప్రభుత్వం కఠిన శిక్ష వేస్తుంది అని రాసి వుంది. ఈ గుహలో నుంచి రెండు దారులు వున్నాయి. ఒకటి ద్వారకకి వెళ్తే, రెండోది జునాగడ్ కి వెళ్తుంది. ఈ రెండు దారులూ రెండు, రెండున్నర గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. గుజరాత్ ప్రభుత్వం వారు గుహలో ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసి , అక్కడక్కడా లైట్స్ పెట్టారు. గుహలకి బయట చుట్టూ వున్న పెద్ద తోటలో వచ్చిన వారు సేద తీరి, వెంట తెచ్చుకున్న భోజనాలు చేయవచ్చు. అదండీ సంగతి. కృష్ణుడు, జాబవంతుడు మల్లయుద్ధం చేసిన గుహలు కథ.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news