కరీంనగర్:కాళేశ్వరంలో క్షుద్ర పూజల కలకలం

-

మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని హమాలి సంఘం గుడిసె వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ప్రాణం తీసిన కోడిపెట్ట,
కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి పూజలు చేసినట్లు కనిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఇది ఎవరు చేశారన్నది తెలియడం లేదు. ఇటీవల ఎస్సీ కాలనీ, వీఐపీ ఘాటు వద్ద కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version