MEDAK: పెట్రోల్ డబ్బాతో మహిళా ఆందోళన

-

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఓ మహిళ పెట్రోల్‌ డబ్బాతో వచ్చి ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే రఘునందన్‌రావు శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. ఈ సంఘటన మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలలో జరిగింది. గ్రామంలో భవన నిర్మాణానికి సేకరించిన స్థలంలో గతంలో మహిళా మండలి భవనం ఉండేది. ఆ భవనాన్ని కూల్చి, గ్రామపంచాయతీ, మహిళా మండలి భవనాల నిర్మాణం చేయాలని గ్రామసభలో తీర్మానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version