వరంగల్ : పెళ్ళైన 15రోజులకే మృత్యువాత

-

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పండుగ రాజ్ కుమార్ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బైకు పై గీసుగొండ నుంచి మనుగొండకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈనెల 11న స్వప్న అనే యువతితో రాజ్ కుమార్‌కు పెళ్లి జరిగింది. పెళ్లైన 15 రోజులకే దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

accident

Read more RELATED
Recommended to you

Exit mobile version