హనుమకొండలో విషాదం.. మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థులకు అస్వస్థత !

-

హనుమకొండ జిల్లా: హనుమ కొండ జిల్లా లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని.. కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో విద్యార్థులు తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. శ్రీరాములపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ 30 మంది విద్యార్థులు..అస్వస్థతకు గురయ్యారు.

70 మంది విద్యార్థులు భోజనం తినగా.. అందులో 30 మందికి మాత్రమే తీవ్ర అస్వస్థత చోటు చేసుకోవడం అందరిలోనూ ఆందోలనను రేపుతోంది. 30 మంది విద్యార్థులు..అస్వస్థతకు గురవ్వడం తో.. శ్రీరాములపల్లె పాఠశాల నుండి 108 ద్వారా స్థానిక కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు.

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై… సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అసలు మధ్యాహ్న భోజనం.. ఎవరు పెట్టారు, ఎందుకు ఇలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version