మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..!అయితే ఇలా చేసి చూడండి..!

-

ప్రస్తుత కాలంలో ఉరుకుల. పరుకుల జీవితంలో వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి, ఆహార విధానంలో మార్పులు వల్ల అధిక బరువు పెరుగుతున్నారు. కానీ అధిక బరువుతో బాధపడేవారు ఎక్కువగా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడి బరువు తగ్గాలని ఆరాటపడుతుంటారు. అలా రసాయన ఉత్పత్తులు వాడటం వలన అప్పటికప్పుడు ఫలితం కనిపించినా సరే వాటి వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే పదార్థాలతో ఈజీగా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.

కరివేపాకు పొడి బరువు తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది. దీని కోసం రెండు కప్పుల కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.ఒక కడాయిలో ఆరిన కరివేపాకు వేసి వేగించి పక్కన ఉంచుకోవాలి.ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాలు వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే పాన్ లో గుప్పెడు అవిసే గింజలు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, అవిసెగింజలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోని,ఒక గాజు సీసాలో నిలువ చేసుకొవాలి. ప్రతిరోజు భోజనం చేసే సమయంలో మొదటి ముద్దలో ఈ పొడిని కలిపి తింటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. లేకుంటే ఒకగ్లాసు మజ్జిగలో అరస్పూన్ పొడి వేసుకుని కలిపి తాగినా మంచి ఫలితం లభిస్తుంది.కావున ఆయుర్వేద లో వున్న ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా అధిక బరువును కూడా వెన్నల కరిగించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇలా ఈ పొడితో అన్నం తింటే మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version