జామసాగులో పురుగులు, తెగుళ్ల నివారణకు ఈ పద్దతులు పాటించేయండి..!

-

జామపంట సాగు కూడా నేడు రైతులు విరివిగా పండిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. మొక్కలు కత్తిరింపులు చేస్తే.. నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. జామలో అధికంగా చీడపీడలు సమస్య ఉంటుంది. ఈరోజు మనం చీడపీడలు ఆశించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఏం మందులు వాడాలి అనేది చూద్దాం.
జామలో పురుగుల నివారణకు
తెల్ల సుడిదోమ : వీటి పిల్ల పురుగులు ఆకులపై తెల్లని దూది లాంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసం పిలుస్తూ ఉంటాయి.ఈ దోమ ఆశించిన ఆకులు ఎర్రగా ముడతలుపడి ఉంటాయి.. పిబ్రవరి నెలలో ఈ దోమలు ఎక్కువగా వ్యాపిస్తాయి. వీటిని నివారించడానికి తొలుత జిగురు పూసిన పసుపురంగు అట్టలను చెట్టు కొమ్మలకు వేలాడతియాలి. వీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడక్లోప్రేడ్-75%డబ్ల్యూజీ లీటర్ నీటికి 0.3 గ్రా:లు, మరియు వేపనునే లీటర్ నీటికి 5ఎంఎల్ తో కలిపి పిచికారి చేసుకుంటే సరి.
పండు ఈగ : కాయలు పక్వానికి వచ్చినప్పుడు ఈ పండు ఈగల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు.. 2 మి:లీ: మిథైల్ యజినాల్, 3గ్రా: 3జి గుళికలను లీటర్ నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని ప్లాస్టిక్ సీసాల్లో 200ఎమ్ ఎల్ చొప్పున పోసి అక్కడక్కడ తోటలో చెట్ల కొమ్మలకు వేలాడేలాగ కట్టాలి. దీనివల్ల మగ ఈగలు ఆకర్షింపబడి.. మందు ద్రావణంలో పడి చనిపోతాయి. లేదా మలథియాన్ లీటర్ నీటికి 3ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేయాలి లేదా మార్కట్లో లబించే ఈగ ఎరలను ఎకరానికి 5-10 అమర్చుకోవాలి.
పిండి నల్లి : ఇవి చిన్న పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా కొమ్మల చివర, కాయల మీద ఆశించి రసాన్ని పిలుస్తూ ఉంటాయి.ఇవి ఆశించిన కాయలు రాలిపోతాయి. ఇవి విసర్జించిన జిగురు వల్ల కాయలపై నల్లటి మసి ఏర్పడుతుంది. ఈ తెగులును ఒకటి రెండు కొమ్మలకు గుర్తించిన వెంటనే అ కొమ్మలను కత్తిరించి కాల్చి వేయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్పెట్-75%ఎస్సి లీటర్ నీటికి 2గ్రా: మరియు డైక్లోరోవాస్ లీటర్ నీటికి 2ఎంఎల్ తో కలిపి పిచికారి చేసుకోవాలి.
నులిపురుగులు : ఇవి ఆశించిన చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. తొలి దశలో చెట్టుకు 100కేజీల పశువుల ఎరువు, 500 గ్రా: వేపపిండి, నులిపురుగుల గుడ్డుపై పరాన్నజీవిగా ఉండే సిలింద్రం మేసిలోమైసిన్ లిలాసినాస్ 25గ్రా: లతో పాటుగా 100గ్రా 3జి గుళికలు చెట్ల పాదులలో వేసుకొని వీటిని అరికట్టవచ్చు.
తెగుళ్ల నివారణకు..
కాయకుళ్లు : లేత కొమ్మలు, ఆకులు, కాయలు మొదట గోధుమ రంగులో మారి తర్వాత నల్లగా మారి కొమ్మ మొత్తం ఎండి పోతుంది. పక్వానికి వచ్చిన పండ్లలపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు ఏర్పడతాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3- 4 రోజుల్లో పండు కుళ్ళిపోవడం జరుగుతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయలో కాపరక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారి చేసుకోవాలి.
ఎండు తెగులు : ఈ తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పై నుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి. ఎక్కువగా చెట్టు కింది భాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది. ఆకులు వడలిపోయి రాలుతాయి. దీనిని నివారించడానికి మొక్కల మొదల్లలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. మొక్కల మొదల్లలో చెట్టుకు 1కేజీ జిప్సం, పశువుల ఎరువు100కేజీలు, వేపపిండి 2కేజీలు, ట్రైకోడమ్మ సిలింద్రానాశని, మొత్తం బాగా కలిపి చెట్టుకు 40కేజీల వరకు వేసుకోవాలి. లేత కొమ్మలలో తెగులు కనిపించినప్పుడు కార్బండిజం 1గ్రా: లీటర్ నీటికి లేదా కాపరక్సిక్లోరైడ్ 3గ్రా: లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యావదిలో రెండు సార్లు నేల తడిసేల మొదలు చుట్టూ పోయాలి.
గజ్జి తెగులు : ఇది ప్రధానంగా పచ్చి కాయలపై కనిపించడం జరుగుతుంది. కాయలపై చిన్నచిన్న తుప్పు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. కాయ పెరిగే కొద్ది మచ్చలు పెరిగి కాయలు పగిలి అంచులు ఎత్తుగా ఉంటాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగా పెరగవు. దీనిని నివారించడానికి కాపరక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version