పళ్ళు పసుపుగా అయిపోయాయా..? ఇలా చేస్తే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి..!

-

దంతాల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. దంతాల సమస్యల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా దంతాల సమస్యల నుండి బయట పడడం కూడా అంత ఈజీ కాదు అయితే చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో పళ్ళు పచ్చగా మారిపోవడం ఒకటి కొంత మంది పళ్ళు తెల్లగా వుండవు. పసుపు రంగు లోకి మారిపోతూ ఉంటాయి. నిజానికి ఇలా జరిగితే మన నవ్వు పాడవుతుంది అందం తగ్గిపోతుంది. పైగా చూడడానికి కూడా అసలు బాగా కనపడదు. అయితే పసుపు రంగులో మారిన పళ్ళని ఈ విధంగా మీరు తెల్లగా మార్చుకోవచ్చు మరి అది ఎలా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పళ్ళు పసుపు రంగులోకి మారిపోయినట్లయితే మీరు సులభంగా ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకుని ఈజీగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు. ఈ పొడి కోసం ఒక టీ స్పూన్ లవంగాల పొడి, ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఒక టీ స్పూన్ లికోరైస్ పౌడర్. 1 స్పూన్ దాల్చిన పొడి, ఎండబెట్టిన వేప, పుదీనా ఆకులు తీసుకోండి.

ఎలా ఈ పొడి ని తయారు చెయ్యాలి..?

ఒక టీ స్పూన్ లవంగాల పొడి, ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఒక టీ స్పూన్ లికోరైస్ పౌడర్. 1 స్పూన్ దాల్చిన పొడి, ఎండబెట్టిన వేప, పుదీనా ఆకులు తీసుకోండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోండి. ఇలా సులభంగా మీరు ఈ పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని మీరు టూత్ బ్రష్ మీద వేసి పళ్ళని శుభ్రం చేసుకుంటే పళ్ళు తెల్లగా వస్తాయి. పసుపు రంగు నుండి తెల్లగా మారతాయి అయితే ఈ పొడిని మీరు పళ్ళకి రుద్దినప్పుడు పెద్దగా ఫోర్స్ పెట్టకర్లేదు తేలికగా రుద్దితే సరిపోతుంది బాగా ఒత్తిడి చేసి రుద్దారంటే పళ్ళ పై పొర వచ్చేయొచ్చు వీటన్నిటిని మీరు మిక్స్ చేసుకునే మంచిగా పొడి చేసుకుని చక్కగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version