జైలులో రామాయణం.. వానరుల వేషంలో సీతను వెతకటానికి వెళ్లి ఖైదీల పరార్

-

దసరా పండుగ నేపథ్యంలో జైలులో రామాయణం నాటకం వేయగా, వానరుల వేషం వేసిన ఇద్దరు ఖైదీలు గోడదూకి పారిపోయారు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని రోషనాబాద్‌ జైలులో ఆలస్యంగా వెలుగుచూసింది.ఖైదీల్లో పరివర్తన కోసం జైలులో దసరా సందర్భంగా రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అందులో పంకజ్‌, రాజ్‌ కుమార్‌ అనే ఇద్దరు ఖైదీలు వానరుల వేషం వేశారు. నాటకంలో భాగంగా వారిద్దరు సీతను వెతుకుతూ వెళ్లి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే నిచ్చెన వేసుకుని 22 అడుగుల గోడ దూకి పారిపోయారు.

దీంతో పోలీసులు వెంటనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.పంకజ్‌ ఓ హత్య కేసులో జీవిత ఖైదు కాగా.. రాజ్‌ కుమార్‌ ఓ కిడ్నాప్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో జైలర్‌ ప్యారేలాల్‌ సహా ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్‌ చేశారు. పంకజ్‌, రాజ్‌కుమార్‌తో పాటు చోటు అనే మరో ఖైదీ పారిపోయేందుకు ప్రయత్నించాడని, కానీ నిచ్చెన కూలిపోవడంతో అతని ప్రయత్నం విఫలమైందని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version