తెలంగాణలో బాబు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ..కేటీఆర్

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణను మరో సారి వంచించడినికి కుట్ర పన్నారని,  ఇందులో భాగంగానే ఎన్నికల్లో కోట్లాది రూపాయల పంపిణీకి తెరతీశారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ  భవన్‌లో విలేకరులతోనూ, లింగాయత్‌లు పార్టీలో చేరిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేటీఆర్‌ ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులతో బాబు తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. ధర్మపురిలో ముగ్గురిని తమ పార్టీ నేతలు పట్టుకున్నారని ఆధారలతో సహా నిరూపిస్తామన్నారు..  ఈ విషయమై ఎన్నికల సంఘం వెంటనే రంగంలోకి దిగి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకు.. రూ.500 కోట్లు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version