హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు పోలీసుల అనుమతి రద్దు

-

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ నటుడు ధనుష్‌ ప్రధాన పాత్రల్లో  ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కుతోంది .తిరుపతిలో ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద చిత్ర బృందం షూటింగ్ జరిగింది. అలిపిరి రోడ్డులో నగర ప్రధాన వీధుల్లో సినిమా షూటింగ్ చేయడంతో భక్తులు, అంబులెన్స్ లు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అంతేకాకుండా.. షూటింగ్ పేరుతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడి చేశారని భక్తులు ఆరోపించారు.

 

కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర బృందం ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చిత్ర యూనిట్ కి బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి మూవీ షూటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్‌ బొమ్మి పనిచేస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైన్‌: రామకృష్ణ, మోనికా నిగోత్రే, సమర్పణ: సోనాలి నారంగ్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version