ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై స్పందించిన అద్దంకి దయాకర్ రావు….

-

ఈరోజు సాయంత్రం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేసే పార్టీ అభ్యర్థులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీ మహేశ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్‌ల అభ్యర్థిత్వ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు . జనవరి 18న ఇరువురు నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండగా, వెంకట్ బల్మూర్ తెలంగాణ NSUI అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇదిలా ఉండగా…..తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ‘పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. నాకే ఇలా జరుగుతోందని అభిమానులెవరూ నిరాశ పడొద్దు. నాకు ఇంకా మంచి పొజిషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండొచ్చు. దీపాదాస్ మున్షీ గారు కూడా ఇదే మాట చెప్పారు. త్వరలో మంచి జరగబోతోంది. పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వానికి, పార్టీకి సహకరిద్దాం’ అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version