పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు ట్రాలీ ఆటోలో వెళ్లున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా… మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఆలూరు మండల పరిధిలోని పెద్దహోతూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఘోర రోడ్డు ప్రమాదం..
-
Previous article
Read more RELATEDRecommended to you
పుట్టింటికి వచ్చిన ఈ ఆడబిడ్డను గెలిపించుకోండి – వైస్ షర్మిల
ys sharmila emtional post: పుట్టింటికి వచ్చిన ఈ ఆడబిడ్డను గెలిపించుకోండి...
కడియం శ్రీహరిపై మోత్కుపల్లి వివాదస్పద వ్యాఖ్యలు..
కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు....
BREAKING: పిఠాపురం బయలుదేరిన రామ్ చరణ్, సతీమణి సురేఖ
BREAKING: పిఠాపురం బయలుదేరారు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ. కాసేపటి...