తెలంగాణలో ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలపై బ్యాన్?

-

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీపై తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించి ఎమర్జెన్సీ ఇతివృత్తం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీకి చెందిన వారి మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సీన్లు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ మూవీ విడుదలపై నిషేధం విధించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.

తమ వర్గాన్ని ఎమర్జెన్సీ మూవీలో దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని 18 మంది సిక్కు సభ్యుల బృందం ప్రభుత్వ సలహాదారు అయిన షబ్బీర్ అలీని కలిసి ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిని ఆయన సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయ నిపుణల సలహా మేరకు ఈ చిత్రంపై రాష్ట్రంలో నిషేధం విధించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో భారతీయులు, దేశం ఎటువంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నదో వెండితెరపై చూపించేందుకు కంగనా స్వీయ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version