దివంగత కిడారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం

-

  • రూ.కోటి సాయం, రెండో కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తాం
  • పెద్ద కుమారుడికి పార్టీ టికెట్‌?

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల చేతులో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మావోయిస్టుల చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయాల్లో కిడారికి ఎంతో భవిష్యత్ ఉందని..ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని సీఎం తెలిపారు.

కిడారి కుటుంబానికి కోటీరూపాయలు ఆర్థిక సాయంతో పాటు చిన్నకుమారుడుకి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పిస్తామని హామి ఇచ్చారు. కిడారి కుటుంబంలోని వారికి రూ.5లక్షల చొప్పున తెదేపా ఫండ్ అందజేస్తామని తెలిపారు. కిడారి నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం తపించేవారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఏదీ ఏమైన కిడారి, సోమ హత్యలను తీవ్రంగా పరిగణిస్తూ..హత్యకు సంబంధించి త్వరలోనే విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news