రాజకీయాలపై బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు …

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నందున కీలక పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచించే పనిలో ఉన్నారు. అందుకోసం నాయకులు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారన్నది స్పష్టంగా అవగతమవుతోంది. కాగా తాజాగా ప్రస్తుత రాజకీయాల పట్ల ఏపీ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గుంటూరు జిల్లా పెదనందిపాడు లో మాట్లాడిన రాఘవులు అమరావతి లో నేతలు కత్తులు దూసుకుంటున్నారన్నారు. ఇంకా వైజాగ్ కబ్జాలకు ప్రధాన కేంద్రంగా మారిందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు రాఘవులు. ఇంకా టీడీపీ అధికారంలో ఉండగా … రాష్ట్ర రాజధాని అమరావతిని పూర్తి చేసి ఉంటే ఈ రోజు చాలా సమస్యలు ఉండేవి కాదని బీవీ రాఘవులు వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేశారు.

కాగా ఈ వ్యాఖ్యలు అటు టీడీపీ మరియు వైసీపీ లకు కటువుగా తగులుతాయి.. మరి ఇరు పార్టీల నుండి ఎవరైనా స్పందిస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version