వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్థానికి హాజరైన అతిరథ మహారథులు……

-

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి  హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స వేదికైంది.ఈ నిశ్చితార్థ వేడుకకు  వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు అతిరథ మహారథులు హాజరవుతున్నారు.  ఈమధ్యనే ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు కావున కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ శుభకార్యానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.ఇటీవల ఏపీలోని తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లి వధూవరులు శుభలేఖ అందించారు. జగన్, భారతి తాడేపల్లి నుంచి హైదరాబాద్ రానున్నారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం ఫిబ్రవరి 17న రాజస్థాన్‌లో,ఫిబ్రవరి 24న శంషాబాద్‌లో విందు ఉంటుంది.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ మేరకు గోల్కొండ రిసార్ట్స్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఆంధ్ర, తెలంగాణ రుచులతో పాటు విదేశీ అతిధులకు మొత్తం 150 రకాల వంటకాలు సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version