నెలాఖరు లోపు టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి : నాదెండ్ల మనోహర్

-

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన ఇన్ చార్జీలతో రాజమండ్రిలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.

టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు విషయం పై ఇన్ చార్జీలతో భేటీలో చర్చించినట్టు పేర్కొన్నారు. ఈనెలాఖరు లోపు రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టికెట్ రాలేదని ఎవ్వరూ నిరుత్సాహ పడవద్దని ఇన్ చార్జీలకు నాదెండ్ల సూచించారు. అధికారంలోకి వస్తే.. అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పారు. టీడీపీ-జనసేన పొత్తులో టికెట్ ఎవ్వరికీ వచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version