సీఎం నితీష్ కుమార్‌పై ఎమ్మెల్సీ కవిత సీరియస్ కామెంట్స్

-

బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎమ్మెల్సీ కవిత గత కొన్ని రోజులుగా బిహార్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఇండియా కూటమి నుంచి విడిపోయి బిహార్‌లో నూత‌న ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికల ముగిసిన ఇండియా కూటమి ఉండదని తాము ముందుగానే చెప్పామని అన్నారు. ఇండియా కూటమి జాతీయ స్థాయిలో నిలదొక్కుకోలేదని ఆమె అన్నారు.

నితీష్ కుమార్ స్వార్థ రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను అగమ్యగోచరంగా తయారు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు . ఇది ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని ,బలమైన ప్రతిపక్షం క్రమంగా బలహీన పడుతోందని అన్నారు. ఇప్పుడు దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం అని అభిప్రాయము వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. దేశంలో కుల గణన జరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version