జైలుపై ఉగ్రవాదుల దాడి.. 14 మంది దుర్మరణం

-

మెక్సికోలో ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. సియుడాడ్​ జుయారెజ్​లోని జైలుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో పది మంది గార్డులు, నలుగురు ఖైదీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 24 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని వెల్లడించారు. ముష్కరులు వాహనంపై ఆదివారం ఉదయం 7 గంటలకు జైలుకు వచ్చి కాల్పులు జరిపారని చెప్పారు.

మరోవైపు.. ఈ దాడికి సమయం ముందే పోలీసులు.. ఎస్​యూవీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ముష్కరులను హతమార్చారు. గత ఆగస్టులో ఇదే జైలులో అల్లర్లు చెలరేగాయి. అవి జుయారెజ్​ వీధుల్లోకి వ్యాపించాయి. ఈ హింసలో 11 మంది మరణించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు కూడా హత్యకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version