గన్నవరంలో 144 సెక్షన్‌: కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

-

ఏపీలోని గన్నవరంలో టీడీపీ నిర్వహించాలనుకున్న చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి ఘటనపైనా ఆయన స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

సోమవారం గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకరావు తలకు గాయమైందని ఎస్పీ చెప్పారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి దృశ్యాలను పరిశీలిస్తున్నామని.. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. గన్నవరం పీఎస్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించినట్లు వివరించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసన కార్యక్రమాలలు చేపట్టొద్దని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version