బిగ్ బ్రేకింగ్; ఏపీలో 15 కొత్త కేసులు…

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 329 కి చేరుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఆరుగురు కరోనా నుంచి కోలుకోగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 15 గంటల్లో 15 కొత్త కేసులు నమోదు అయ్యాయి రాష్ట్రంలో.

నెల్లూరులో ఆరు, కృష్ణా జిల్లాలో 6 కేసులు నమోదు కాగా చిత్తూరు జిలాలో మూడు కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే కీలక అధికారులకు సమాచార శాఖ నుంచి సమాచారం వెళ్లినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 74 కేసులు నమోదు అయ్యాయి. దీనితో జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version