పెరూలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

-

దక్షిణపెరూలోని అరేక్విపలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 15 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది.

భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. వీరిని రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version