సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20మంది దుర్మరణం

-

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బస్సు వంతెనను ఢీకొట్టంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

హజ్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు బ్రేక్‌లు ఫెయిలవ్వడంతో వంతెనను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. యెమెన్‌ సరిహద్దులోని నైరుతి ఆసిర్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version