అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్‌ షాక్‌తో ముగ్గురు మృతి

-

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో కరెంట్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్‌ తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. షాక్‌ కొట్టి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఇంకో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి జరిగినట్లు స్థానికులు తెలియచేశారు. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో తిరుపతి, రవీంద్రన్, మునప్ప మృతి చెందినట్లు సమాచారం. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురి మృతదేహాలను తరలించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ముగ్గురి ప్రాణాలు పోయాయని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version