30 గంటల తర్వాత శాంతించిన జేసీ దివాకర్ రెడ్డి

-


తాడిపత్రి మండలంలోని చిన్నపాడమలలో గత రెండు రోజులుగా తలెత్తిన వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రబోధానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులకు, గ్రామస్తులకు మధ్య తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది దీంతో ఆ రెండు వర్గాల మధ్య గొడవ ముదరడంతో ఆదివారం గ్రామస్తులకు మద్దతుగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు.

విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని ఆశ్రమ నిర్వాహకులతో చర్చలు జరిపారు. రెండు దఫాలుగా జరిపిన చర్చల్లో ఆశ్రమంలో ఉన్న స్థానికేతరులు అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించారు. దీంతో వారిని ప్రత్యక వాహనాల్లో సాముధ బలగాల మధ్య ఆశ్రమం నుంచి తరలించారు. ఈ చర్యతో శాంతించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఆందోళనను విరమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version