గుడ్‌న్యూస్‌.. మేడారం జాతరకు 3845 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..హైదరాబాద్ నుంచి కూడా !

-

మేడారం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మేడారం జాతరకు ఏకంగా 3845 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రకటన చేసారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు బస్సులు రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు. మేడారం జాతరకు ఆర్టీసీ సర్వీసుల నిర్వహణ పై ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ తో తాజాగా బస్‌ భవన్‌ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

కరోనా నుంచ రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా బూస్టర్‌ డోసులను ఇప్పించాలని.. హ్యాండ్‌ శానిటైజర్స్‌, మాస్కులను అందించాలని చెప్పారు. డిపో నుంచి బయలు దేరే సమయంలో.. బస్సును పూర్తిగా శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి మాట్లాడుతూ.. జాతర బస్సుల రాకపోకల పర్యవేక్షణకు 12 వేల మంది సిబ్బంది, 150 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. 50 సీసీ కెమెరాలతో బస్సుల రాకపోకలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version