24 గంటల్లోగా తొలగించాలి… రజత్ కుమార్

-

ఎన్నికల నోటిఫికేష్ విడుదలైన సందర్భంగా నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లో తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను 72 గంటల్లోగా తొలగించాలని సూచించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లకు తక్షణం ఆదేశాలు పంపుతున్నట్లు తెలిపారు.  ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని నేతలు తక్షణం రద్దు చేసుకోవాలని ఆదేశించారు.  ప్రభుత్వ సిబ్బంది మాత్రమే అధికారిక వాహనాలు వినియోగించవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version