ఏపీలో కొత్తగా 7,855 కరోనా కేసులు..!

-

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ తీవ్రత పెరిగినా ప్రజల్లో మార్పు రావడం లేదు. కరోనా నింబంధనలను గాలికి వదిలేశారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. పోలీసు అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో కేసులు ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

corona

తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ఏపీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 7,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 52మంది కరోనా బారినపడి మరణించారని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొవిడ్‌-19 కేసుల సంఖ్య 6,54,385కు చేరింది. అంతేకాకుండా ఏపీలో 69,353 కరోనా కేసులు యాక్టివ్‌ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,79,474 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరారు. రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5558కి చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version