ఏపీలో టీకా వికటించి 19 ఏళ్ల యువకుడు మృతి !

-

గుంటూరు లో దారుణం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వికటించి 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21 వ తేదీన పాలకొల్లు లో వ్యాక్సిన్ వేయించుకున్నాడు మృతుడు సూర్య తేజ. అయితే వ్యాక్సిన్ వేయించు కున్న గంట లోనే వాంతు లతో పడిపోయాడు సూర్య తేజ. దీంతో హుటా హుటిన స్దానిక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

మెరుగైన వైద్యం కోసం స్దానిక ఆసుపత్రి నుంచి మంగళగిరి ఎన్ఆర్ఐ కు తరలించారు. మూడు రోజులు పాటు వెంటిలేషన్ పై ప్రాణాలతో కొట్టుమిట్టాడని సూర్య తేజ ఇవాళ మృతి చెందారు. దీంతో సూర్య తేజ మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి సిబ్బంది. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ తమకు లేకుండా పోయాడని కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా ఏపీ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి కేసులు తగ్గు ముఖం పడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version