ఆఫ్షనిస్తాన్ లాగే.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది : షర్మిల

-

మంచిర్యాల : తాలిబన్ల చేతిలో ఆఫ్షనిస్తాన్లు ఎలా బందీ అయ్యోరో… కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఏడెళ్లుగా తెలంగాణ బందీ అయిందని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరాడి సాదించుకున్న తెలంగాణ లో అధికారాన్ని కేసిఆర్ చేతిలో పెడితే అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని.. పోరాటం చేసిన యువకులు, విద్యార్థులను బలిపీఠం ఎక్కిస్తున్నారని నిప్పులు చెరిగారు.

సీఎం కు ఎంతమంది నిరుద్యోగులున్నారో తెలియదని.. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నరేష్ నాయక్ లాంటి వారు ఆత్మహత్య చేసుకునే వారా…? అని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసిఆర్ కారణమన్నారు. ఇందుకేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది..నీతిమాలిన రాజకియాలు చేయడానికేనా అధికారం.. ? అని నిలదీశారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగేదాని పై స్పందించిన కేటిఆర్ కు ఇక్కడ జరిగే ఆత్మహత్యలు కనిపించడం లేదా.. ? అని నిలదీశారు. హుజూరాబాద్ లో బుద్ది చెప్పితేనే నోటిఫికేషన్లు వస్తాయన్నారు వైఎస్ షర్మిల..

Read more RELATED
Recommended to you

Exit mobile version