భారత ఆర్మీకి తప్పిన పెద్ద ప్రమాదం

-

జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు, ఆర్మీ ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఏదోక రూపంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటనకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో బాంబు దాడికి ప్రయత్నం చేసారు. శ్రీనగర్- బారాముల్లా జాతీయ రహదారిపై 29 ఆర్ఆర్ దళాలు బాంబు ని స్వాధీనం చేసుకున్నాయి. ఆర్మీ దళాలను లక్ష్యంగా చేసుకుని బాంబు అమర్చారు.

వీటిని గుర్తించిన ఆర్మీ బాంబు స్క్వాడ్ కి సమాచారం ఇవ్వగా… స్వాధీనం చేసుకున్న బాంబు ని నిర్వీర్యం చేసింది. ఇది ఐఈడీ అని ఆర్మీ పేర్కొంది. తమను లక్ష్యంగా చేసుకుని… బాంబు అమర్చారు అని ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలు మొహరించాయి. పక్కా ప్లాన్ తో అమర్చినా సరే ఆర్మీ ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version