రోడ్డు దాటిస్తానని చెప్పి అంధురాలిపై అత్యాచారం

-

ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.నిత్యం ఎక్కడో ఓ చోట ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా అవేమీ పట్టనట్టూ.. మూర్ఖులు ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడవారు అయితే చాలు అన్నట్లుగా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానవీయ ఘటన జరిగింది.

అంధురాలిని రోడ్డు దాటిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మే 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు రాత్రి బస్సు దిగిన అంధురాలిని ఓ వ్యక్తి రోడ్డు దాటిస్తానని చెప్పి నిర్మానుష్యంగా ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ కామాంధుడు. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version