BREAKING : జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్య

-

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి పట్టణ సమీపంలో జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్య కు గురయ్యాడు. పేరూరు చెరువు వద్ద కత్తులతో కిరాతకంగా కొంత మంది దుండగులు నరికి చంపారు. ఇక విషయంపై స్థానిక పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

murder

మృతున్ని గాంధీ పురంకు చెందిన సుహానా భాషా గా గుర్తించారు పోలీసులు. అటు ఈ విషయం తెలియగానే… సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు జనసేన పార్టీ నాయకులు. ఈ హత్య పై పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు కూడా సమాచారం ఇచ్చారు నాయకులు. ఈ హత్య నేపథ్యంలో.. ఇవాళ ఏపీ పవన్‌ కళ్యాణ్‌ కూడా పర్యటించే ఛాన్స్‌ ఉంది. ఇక హత్య చేసిన అనంతరం..ఆ దుండగులు పరారీ అయ్యారు. దీంతో పరారైన దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version