నగరంలో కల్తీ మద్యం తయారీ ముఠా అరెస్ట్

-

హైదరాబాద్లో కల్తీ వైన్ తయారీ చేస్తున్న ముఠాను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళా వద్ద నుంచి 90 కల్తీ వైన్ బాటిల్స్ ను సీజ్ చేశారు.లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ గృహిణిగా గుర్తించారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా.. రహస్యంగా ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్, 2 లీటర్ల బాటలలో నింపి విక్రయిస్తోంది. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారంతో ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఎక్సైజ్ అధికారులు. ఈ క్రమంలో.. 112 బాటిల్లలో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ సీజ్ చేశారు.

ఈ కేసుపై ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. లాలాగూడలో కల్తీ వైన్ తయారు చేస్తున్న ఆంగ్లో ఇండియన్ మహిళను అరెస్ట్ చేసామని తెలిపారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో కల్తీ వైన్ తయారీ చేసి విక్రయిస్తుందని పేర్కొన్నారు. తన ఇంట్లో కొంత కాలంగా ఎక్సైజ్ అనుమతులు లేకుండా.. రహస్యంగా కుళ్ళిపోయిన ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్, రెండు లీటర్ల బాటలలో నింపి తెలిసిన వారికి విక్రయిస్తుందని తమకు సమాచారం అందిందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. దీంతో తెల్లవారుజాము ఎక్సైజ్ అధికారులు, తమ టీం ఆకస్మిక దాడులు చేసామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version